అక్షరటుడే వెబ్డెస్క్: UPI MDR Charges | యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రూపంలో పరోక్షంగా చార్జీలు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రూ.2 వేలకు మించిన లావాదేవీలు యూపీఐ వాల్యూమ్లో కేవలం 5 శాతమే అయినప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో మాత్రం ఇవి దాదాపు 65 శాతం వరకు ఉంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
UPI MDR Charges | సామాన్యుల జేబుకే చిల్లు..
కస్టమర్లపై నేరుగా ఎలాంటి రుసుములు విధించడం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులపై పడే ఈ అదనపు భారం చివరికి ఎక్కడి నుంచి వస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మర్చంట్లు చెల్లించే ఈ రుసుములను వస్తువులు, సేవల ధరలకు కలపడం వల్ల.. పరోక్షంగా ఆ భారం సాధారణ ప్రజల జేబుల పైనే పడుతుందని రాహుల్ ఎత్తిచూపారు.
UPI MDR Charges | అగ్రరాజ్య ఒత్తిడికి..
భారత్లో అమలవుతున్న జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా చెల్లింపుల కంపెనీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ దేశాల ఒత్తిడికి తలొగ్గుతోందని ఆరోపించారు. గతంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాల మాదిరిగానే.. ప్రస్తుత నిర్ణయంతోనూ ప్రధాని మోదీమరోసారి అగ్రరాజ్య ఒత్తిడికి తలవంచి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు