CP Radhakrishnan | తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరుకానున్న ఉప రాష్ట్రపతి

తెలంగాణ విమోచన దినోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CP Radhakrishnan | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పరేడ్​ గ్రౌండ్​లో జరిగే ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

పరేడ్​ గ్రౌండ్స్​లో ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి పరేడ్‌లో కేంద్ర పారామిలటరీ దళాల కవాతు ఉంటుంది. తెలంగాణ కళాకారుల వివిధ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ విమోచన ఉద్యమ ఘట్టాలపై బుధవారం ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. పరేడ్​ గ్రౌండ్స్​లో జరుగుతున్న ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy) మంగళవారం పరిశీలించారు.

CP Radhakrishnan | ఏర్పాట్లపై సమీక్ష

ఉపరాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) తెలిపారు. ఆయన పర్యటనపై సచివాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 17 న ఉదయం 8.30 గంటలకు సీపీ రాధాకృష్ణన్​ హైదరాబాద్​కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Maoist Lalitha Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *