అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని (Yellareddy) వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
Yellareddy Police | ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో..
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి (Venkatapur village) చెందిన ఎముల చిన్న లింగయ్య (71) వ్యవసాయం చేస్తుండేవాడు. అయితే కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కామారెడ్డిలో (Kamareddy) వైద్య చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి గ్రామ శివారులోని పస్కపోచమ్మ ఆలయం సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఎముల రామవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Stock Market Fall | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు


