అక్షరటుడే, వెబ్డెస్క్:YSRCP Criticism | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సవిత వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె… అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి తెరలేపారు. మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ (Telugu Desam Party) సమాజం కోసం మంచి చేసే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అయితే, వైసీపీ YSR Congress Party హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీలా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
YSRCP Criticism | జగన్పై తీవ్ర ఆరోపణలు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)పై కూడా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్యలు చేయడం, సాక్షులను బెదిరించడం, డబ్బులు మాట్లాడటం, కుటుంబ సభ్యులు, జడ్జిలను కూడా భయపెట్టే ప్రయత్నాలు చేయడం జగన్కు అలవాటైపోయిందని ఆరోపించారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు కూడా “శవ రాజకీయాలు” చేస్తున్నారని మండిపడ్డారు.
YSRCP Criticism | మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం
అనంత బాబు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ మంత్రి సవిత (Minister Savita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత బాబును జగన్ ప్రోత్సహించడంతోనే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య జరిగిందని ఆరోపించారు. ఇది జగన్ సైకో ధోరణికి పరాకాష్టగా నిలిచిందని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఏవైనా లోపాలు జరిగి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని చెప్పారు. జగన్ పాలనలో బలైన వారిలో బీసీలు, దళితులే ఎక్కువగా ఉన్నారని మంత్రి సవిత ఆరోపించారు. చంపడం, రౌడీలను, గూండాలను తయారు చేయడమే వైసీపీ పని అయిపోయిందని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Solar Plant | రాంబిల్లిలో మెగా సోలార్ ప్లాంట్.. శంకుస్థాపన చేసిన సీఎం!

