అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad LIG Housing | హైదరాబాద్ (Hyderabad) నగరంలో నివసించే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి విడతలో నగరంలో లక్ష ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురా నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను బుధవారం పరిశీలించారు. కుల్సుంపురా, అఫ్జల్ సాగర్ ప్రాంతాలతో పాటు కాలదేరా, గడ్డియన్నారం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భూములు, భవనాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించి పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
Hyderabad LIG Housing | సీఎం ఆదేశాల మేరకు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందించేందుకు ఎల్ఐజీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అవసరమైన స్థలాల గుర్తింపు, ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు చర్యలు చేపడుతున్నారని వివరించారు.
ఇది కూడా చదవండి..: One Hyd Park | హైదరాబాద్లో స్మార్ట్ హోమ్స్.. స్నైడర్ ఎలక్ట్రిక్ బిగ్ పార్టనర్షిప్


