అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట (Siddipet) పట్టణంలోని యాదవ సంఘం లో ఏర్పాటుచేసిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.
Harish Rao | హరీశ్రావు మాట్లాడుతూ..
కేసీఆర్ హయాంలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. చట్టసభల్లో సైతం అవకాశం కల్పించామని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో కనీసం బీసీ కార్పొరేషన్ లేదని, బీసీల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
మంచి పేరు తేవాలి..
ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని హరీశ్రావు సూచించారు. కుల సంఘాలు జాతి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చదువుకు కులం, పేదరికం అడ్డు కాదని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ పురస్కారాలు, అవార్డులు అందజేయడంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం లభిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి..: Crime Control Measures | నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి : డీజీపీ ఆనంద్


