అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Illegal Moram Mining | జిల్లాలో చీతా ఫోర్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేలా మెరుపు దాడులు చేస్తోంది. తాజాగా కమ్మర్పల్లి మండలం (Kammarpally Mandal) బషీరాబాద్ శివారులో గల కాడి చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపు దాడి నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అక్కడ అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించింది.
Illegal Moram Mining | ఐదు ట్రాక్టర్ల స్వాధీనం
తనిఖీల సందర్భంగా మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న ఒక జేసీబీ, మొరాన్ని రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోకు అప్పగించారు.
Illegal Moram Mining | కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Yellareddy Development | ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం


