అక్షరటుడే, వెబ్డెస్క్: Chandrababu Drinks Toddy | ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన లైఫ్ స్టైల్ అందరికీ ఆదర్శం. నిత్యం ఆయన తీసుకునే భోజనం అలవాట్లను ఎన్నోసార్లు పలు వేదికలపై పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కాగా.. సీఎం చంద్రబాబు తాజాగా తాటి కల్లు తాగారు. అవును మీరు వింటున్నది నిజమే ఆయన స్వయంగా తాటి ఆకులో కల్లు తాగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సీఎం చంద్రబాబు సోమవారం కాకినాడ జిల్లా (Kakinada District)లో పర్యటించారు. చామవరం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కాన్వాయ్లో వెళ్తూ ఓ గీత కార్మికుడిని చూసి ఆగారు. సింహాచలం అనే గీత కార్మికుడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి ఒక సామాన్యుడిలా చంద్రబాబు ఓ పూరిగుడిసెకు వెళ్లి, ఏకంగా తాటి చెట్టు దగ్గర నిలబడి డొప్పలో కల్లు తాగారు.
Chandrababu Drinks Toddy | ఆరోగ్యానికి మేలు
ఇక తాటి కల్లు గురించి తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ వాసులకు చెప్పనక్కర్లేదు. నిత్యం లిమిట్గా తాటి కల్లు తీసుకునే వారికి క్యాన్సర్ లాంటి రోగాలు దరిచేరవని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తెలంగాణలో దొరికే తాటి కల్లుకి ప్రత్యేకతలు ఉన్నాయి. స్వచ్ఛమైన తాటి, ఈత కల్లుతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉదయాన్ని నీరా తాగితే ఎంతో మేలు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాటి, ఈత కల్లును ప్రోత్సహిస్తోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: NTR Bharosa Pensions | జూన్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. రూ.2,728 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం


