అక్షరటుడే, వెబ్డెస్క్ : Amaravati CGO Complex | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం నిధులు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వివరాలు వెలల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతిలో రూ.1,299 కోట్లతో సీజీవో కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం రూ.1,235 కోట్లు కేటాయించారు. అమరావతి ఒక కొత్త నగరంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అక్కడ ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే కాంప్లెక్స్లోకి తరలిస్తామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 5.5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఇందులో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Amaravati CGO Complex | మెట్రో ఫేజ్–2కు ఆమోదం
గుజరాత్లోని అహ్మదాబాద్లో మెట్రో ఫేజ్ 2ఏ కోసం కోటేశ్వర్ రోడ్-ఎయిర్పోర్ట్ కారిడార్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,169 కోట్ల వ్యయంతో ఐదు స్టేషన్లతో కూడిన ఆరు కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఫేజ్-2A అందుబాటులోకి వచ్చిన తర్వాత, అహ్మదాబాద్-గాంధీనగర్ ప్రాంతాల్లో 77 కిలోమీటర్లకు పైగా విస్తరించిన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని మంత్రి చెప్పారు.
ఇది కూడా చదవండి..: Vizag Steel Plant Accident | స్టీల్ ప్లాంట్లో వరుస ప్రమాదాలు.. ప్రభుత్వ తీరుపై జగన్ ఫైర్
