Pension Live Authentication | వినాయక్​నగర్​లో పింఛన్ లైవ్​​ అథెంటికేషన్ ​

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pension Live Authentication | చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారి పింఛన్లు తొలగించడానికి లైవ్​ అథెంటికేషన్​ (Live Authentication) ప్రక్రియ ప్రారంభించింది.

Pension Live Authentication

చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. ఈ మేరకు నగరంలోని వినాయక నగర్ (Vinayaka Nagar) ప్రాంతంలో మున్నూరు కాపు సంఘంలో లైవ్​ అథెంటికేషన్​ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాలనీలో పింఛన్​ పొందుతున్న వారు వచ్చి లైవ్​ అథెంటికేషన్​ చేయించుకోవాలని 45వ డివిజన్​ కార్పొరేటర్​ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ కోరారు. వార్డు ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్ల మనోగతం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *