అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pension Live Authentication | చేయూత పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారి పింఛన్లు తొలగించడానికి లైవ్ అథెంటికేషన్ (Live Authentication) ప్రక్రియ ప్రారంభించింది.

చేయూత లబ్ధిదారులు తాము జీవించే ఉన్నామని వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా నిరూపించుకోవాలి. ఈ మేరకు నగరంలోని వినాయక నగర్ (Vinayaka Nagar) ప్రాంతంలో మున్నూరు కాపు సంఘంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాలనీలో పింఛన్ పొందుతున్న వారు వచ్చి లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలని 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ కోరారు. వార్డు ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ల మనోగతం
