అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Dichpally Highway | డిచ్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్ ఢీకొట్టిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.
Dichpally Highway | గన్నారం నుంచి వస్తుండగా..
ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆటోలో ఇందల్వాయి(Indalwai) మండలం గన్నారం వెళ్లి వస్తుండగా డిచ్పల్లి హైవేపై ఆటోను బైక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి పడిపోయింది. అందులోని 11 మందికి గాయలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా.. వారు క్షతగాత్రులను నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : గోదావరి నదిలో దూకిన మహిళ.. కాపాడిన మత్స్యకారులు