అక్షరటుడే, వెబ్డెస్క్ : Southwest Monsoon | అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. కొంతకాలంగా ఎండలు మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అక్కడక్కడ అకాల వర్షాలు కురిసిన ఎండలు తగ్గకపోవడంతో ఉపశమనం లభించలేదు. దీంతో ప్రజలు తొలకరి పలకరింపు కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వాతావారణ శాఖ అధికారులు చల్లని కబురు చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళంను తాకాయన్నారు.
దేశ రైతాంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్లోకి అడుగుపెట్టాయి. తాజాగా కేరళం తీరాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ప్రస్తుతం కేరళం అంతటా విస్తరించిన రుతుపవనాలు, దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను తాకాయి.. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Southwest Monsoon | రెండో వారంలో..
ప్రస్తుతం కేరళంలో విస్తరించిన రుతు పవనాలు జూన్ రెండో వారంలో తెలంగాణను తాకనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి 14 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా గతేడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి మే 26న ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలో రుతుపవనాలు జూన్ 8–10 మధ్య వస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తొంది.
Southwest Monsoon | ఎల్నినో ప్రభావం
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. మధ్య తెలంగాణలో సాధారణ వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణలో తక్కువ పడుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు రూపొంచించుకోవాలని అధికారులు సూచించారు.
Southwest Monsoon | సాగు పనుల్లో బిజీ
దేశంలోకి నైరుతి ఆగమనంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దుక్కులు దున్నారు. కొంతమంది తుకాలు కూడా పోశారు. తొలకరి పలకరింపు తర్వాత వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే అన్నదాతలు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు నిత్యం కళకళలాడుతున్నాయి.
ఐఎండీ మ్యాప్ ప్రకారం 2026 నైరుతి రుతుపవనాలు మే 16-17 తేదీల్లో అండమాన్లో ప్రవేశించి, జూన్ 4 నాటికి తెలుగు రాష్ట్రాలతో సహా ఒడిశా, బెంగాల్, ఈశాన్య ప్రాంతాలకు విస్తరించాయి. ఇందులో ఎరుపు గీతలు రుతుపవనాల సాధారణ రాకను, నీలం గీతలు ఈ ఏడాది వాస్తవ రాకను సూచిస్తున్నాయి. pic.twitter.com/nAICIlcEZi
— TG Govt Updates (@TGGovtUpdates) June 4, 2026
దీనిని కూడా చదవండి : TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే
