అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Resonance Academy | నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ‘రెసోనెన్స్ ఐఐటీ ఫౌండేషన్, నీట్ అకాడమీ’ని (NEET Academy) నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు (Nizamabad Education) హెచ్చరించారు. ఈ సంస్థపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
Resonance Academy | జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఫిర్యాదు..
ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో (DEO Nizamabad) అధికారికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సెంటర్ పేరుతో ఈ అకాడమీ ఏర్పాటు కోసం నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లు చేశారన్నారు. ఎలాంటి అనుమతులు లేని ఈ సంస్థ ప్రచారానికి మాజీ ఐపీఎస్ అధికారి ముఖ్య అతిథిగా రావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

Resonance Academy | విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సంకేతాలు..!
సమాజంలో ఆదర్శంగా ఉండే ప్రముఖులు సంస్థల అనుమతుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఇలాంటి సంస్థల వల్ల భవిష్యత్లో విద్యార్థులకు భద్రతాపరమైన సమస్యలు వస్తే బాధ్యులెవరో తెలియక తల్లిదండ్రులు నష్టపోతారని వారన్నారు.
జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించి ఈ అకాడమీని సీజ్ చేయకపోతే, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. టీఎస్ఏ, టీఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం, టీఎన్ఎస్ఎఫ్, బీసీవీఎస్ నాయకులు కిరణ్, మహేష్, ప్రతాప్, యూసుఫ్, జ్వాల, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
