నిజామాబాద్ సిటీ : Nizamabad Electric Bus | టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన నగరంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
Nizamabad Electric Bus | సీపీ కార్యాలయం ఎదుట..

నిజామాబాద్ డిపో–2కు చెందిన బస్సు నగరంలోని సీపీ కార్యాలయం ఎదుట నిలిచిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు (Traffic police) వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూశారు. బస్సులో ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.
ఇది కూడా చదవండి..: BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి
