Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్​ గ్యాంగ్ అరెస్ట్

గచ్చిబౌలిలో ఉన్న 'హిల్ రిడ్జ్ విల్లాస్'లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Gang Arrested | హైదరాబాద్‌ (Hyderabad)లోని గచ్చిబౌలిలో ఉన్న ‘హిల్ రిడ్జ్ విల్లాస్’లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. నిందితుల  నుంచి సుమారు 8 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలి (Gachibowli)లోని ‘హిల్ రిడ్జ్ విల్లాస్’లో ఉన్న ఒక విల్లాలో ఈ నెల 6న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంటి యజమానులు లేని సమయంలో నేపాలీ దంపతులు చోరీకి పాల్పడ్డారు. ఆ విల్లాలో నివసిస్తున్న వృద్ధ దంపతులు జూన్​ 7న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఒక చిన్న విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కనిపించకపోవడాన్ని గమనించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

gold 1

Nepal Gang Arrested | లాకర్​లో బంగారం మాయం

ఆ దంపతుల కుమారుడు ఈ నెల 8న ఇంటికి వచ్చి తన వద్ద ఉన్న తాళం చెవితో లాకర్‌ను తెరిచాడు. లాకర్ నుండి సుమారు 7–8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ (SOT), క్రైమ్ బృందాలు, స్థానిక పోలీసులను రంగంలోకి దించారు. లభించిన ఆధారాల మేరకు నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు.

Nepal Gang Arrested | యూపీలో..

nepal gang

గచ్చిబౌలి పోలీస్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆయన బృందం ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా బిలాస్‌పూర్ రోడ్డు వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించబడిన మొత్తం సొత్తును నష్టం లేకుండా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నేపాల్​కు చెందిన కమల్ షాహి (32), ఆయన భార్యా విమల షాహి అలియాస్ బిమల షాహి, కల్పన షాహి (26)గా గుర్తించారు.

Nepal Gang Arrested | పని మనిషులుగా చేరి..

ఈ కేసులో ప్రధాన నిందితుడు నేపాల్​కు చెందిన సురేష్​ అలియాస్​ సూరజ్​ పరారీలో ఉన్నాడు. ఇతడు విలాసవంతమైన విల్లాలలో నివసించే ఉన్నత వృత్తి నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇళ్లలోకి పనివాళ్లను చేర్పిస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అవకాశం తీసుకుని, ఇంటి తలుపులు, లాకర్లు పగలగొట్టి బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తాడు.

దీనిని కూడా చదవండి : Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *