అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay Students | కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay) నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చదువులో పేదరికం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆయన రెండు కీలక ప్రకటనలు చేశారు.
Bandi Sanjay Students |ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు:
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ‘మోదీ గిఫ్ట్’ పేరుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుండి బడులకు వచ్చే విద్యార్థుల ప్రయాణ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా వీటిని సమకూరుస్తున్నారు.

Bandi Sanjay Students |సొంత జీతంతో పరీక్ష ఫీజులు..
ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో అధిక శాతం మంది పేద, కార్మిక కుటుంబాలకు చెందిన వారేనని మంత్రి పేర్కొన్నారు. పరీక్ష ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న దాదాపు 12 వేల మంది విద్యార్థులకు, తన సొంత జీతం నుండే పరీక్ష ఫీజులను చెల్లించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.
Bandi Sanjay Students | హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు..
ఎంపీగా గెలిచిన తర్వాత, నియోజకవర్గంలోని విద్యార్థుల బాధ్యతను ఈ స్థాయిలో భుజానికెత్తుకోవడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంత్రి నిర్ణయంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Missing Girl Jaanu | కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా.. దొరకని జాను ఆచూకీ