అక్షరటుడే, లింగంపేట: Lingampet BJP | మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నాయకుడు ఓబీసీ మోర్చా (OBC Morcha) జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందారు.
Lingampet BJP | నమ్మిన సిద్ధాంతానికి మారుపేరు..
లింగంపేట (Lingampet) మండల కేంద్రానికి చెందిన మహారాజుల మురళి హిందుతత్వవాది అని ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడని స్థానిక బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రామ్ మందిర్ కరసేవకుడిగా సేవలందించారన్నారు. అనేక పోరాటాలు, హిందుత్వం కోసం కృషిచేసిన గొప్ప నాయకుడని ఆయన మృతి పట్ల లింగంపేట ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీవ్రగా కృషి చేశాడన్నారు. మండలంలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు ఆయన శాయాశక్తులా ప్రయత్నించాడన్నారు.
