Draksharam Fire | ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40కి పైగా దుకాణాలు కాలిపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Draksharam Fire | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) ద్రాక్షారామ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అగ్ని ప్రమాదంలో 40కి పైగా దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలకు ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తి నష్టంజరిగినట్లు బాధితులు తెలిపారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Draksharam Fire | న్యాయం చేస్తాం

కాలిపోయిన వాటిలో పది వరకు కిరాణా దుకాణాలు, మిగతావి కూరగాయలు, మాంసం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో కిరాణా దుకాణంలో రూ.10 లక్షల పై చిలుకు విలువ చేసే సరుకులు ఉన్నట్లు యజమానులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో సామగ్రి బయటకు తీసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..:Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *