అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revenue Tampering | రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారిపై(Record Assistant) వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Revenue Tampering | నగరంలోని నార్త్ తహశీల్దార్ కార్యాలయంలో..
నిజామాబాద్(Nizamabad) నార్త్ తహశీల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న జె రాహుల్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల (పహాణీల)లో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
Revenue Tampering | కంఠేశ్వర్ ప్రాంతంలో..
నిజామాబాద్ నార్త్ మండలం పరిధిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 291/ఏ, 291ఏఏ, 292లకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించి ప్రాథమిక విచారణ జరిపించారు. రెవెన్యూ రికార్డుల టాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడైంది. దీంతో విచారణ నివేదిక ఆధారంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డు అసిస్టెంట్ జే రాహుల్ను సస్పెండ్ చేస్తూ శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ నేతలను తగ్గించాలని నేనెందుకు అనుకుంటా..?