Kasturba Negligence | కస్తుర్బాలో విద్యార్థినులు ఆర్తనాదాలు.. ఇన్​ఛార్జి నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న నిరసనలు

గాంధారి మండల కేంద్రంలోని కస్తుర్బాలో విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Kasturba Negligence | తల్లిదండ్రులు ఎంతో భరోసాతో తమ పిల్లలను కస్తుర్బాలో చేర్పిస్తున్నారు.. కానీ అక్కడి సిబ్బంది బాలికల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి (gandhari) మండల కేంద్రంలోని కస్తుర్బాలో విద్యార్థినుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.

Kasturba Negligence | మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో..

గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో (Kasturba Gandhi School) కొందరు విద్యార్థినులు ఆదివారం కడుపులో, ఛాతిలో నొప్పి వస్తుందని అక్కడి ఇన్​ఛార్జికి చెప్పారు.

అయితే, సదరు ఇన్​ఛార్జి మాత్రం ‘నీళ్లు తాగి పడుకోండి.. తగ్గిపోతుంది’ అంటూ నిర్లక్ష్యంగా సమధానం ఇచ్చారని విద్యార్థినులు వెక్కివెక్కి ఏడ్చారు. అంతేకాకుండా కస్తుర్బాలో కనీసం తాగడానికి నీరు కూడా లేవని.. బాత్రూం సౌకర్యం కూడా సరిగ్గా లేదన్నారు. తమ దుస్థితిని ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని వారు రోధించారు.

మారుమూల ప్రాంతాల నుంచి ఉన్నత మంచి విద్యను అభ్యసించాలని ఇక్కడికి వస్తే మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు వాపోయారు. అనంతరం వారు తమ తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఆరోగ్యపరంగా నైనా అక్కడి ఇన్​ఛార్జి సరైన రీతిలో స్పందించాల్సి ఉందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: టాలీవుడ్​లో జూన్​ 29 అరుదైన రోజు. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *