అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Loan Fraud | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంక రెడ్డి కస్టమర్ల గోల్డ్ను మరోసంస్థకు మళ్లించి.. రూ.పది కోట్ల మేర దోపిడీకి పాల్పడింది.
కేపీహెచ్బీ (KPHB) కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్లో పలువురు బంగారంపై లోన్లు తీసుకున్నారు. అయితే తక్కువ వడ్డీకి లోన్ ఇప్పిస్తానని మేనేజర్ ప్రియాంక వారిని నమ్మించింది. సంస్థలోని బంగారాన్ని మరో సంస్థకు బదిలీ చేసింది. ఇలా 40 మందికి సంబంధించిన రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె మరో సంస్థకు మళ్లించి దోపిడీకి పాల్పడింది.
Gold Loan Fraud | బంగారం ఇవ్వకపోవడంతో..
సాధారణంగా బంగారం రుణాల వడ్డీ 12 నుంచి 14 శాతం ఉంటుంది. అయితే 6 శాతానికే ఇస్తామని ప్రియాంక నమ్మించారు. దీంతో చాలా మంది చెప్పినట్లు చేశారు. అంతేకాకుండా వడ్డీ డబ్బులను ప్రతి నెలా ఆమె తన వ్యక్తిగత ఖాతాలో వేయించుకున్నారు. బంగారం విలువ పెరగడంతో దానిపై ఆమె టాప్ఆప్ లోన్ కూడా తీసుకున్నారు. ఆ డబ్బులను కస్టమర్లకు ఇవ్వలేదు. అయితే పలువురు కస్టమర్లు ఇటీవల డబ్బులు చెల్లించారు. తిరిగి బంగారం ఇవ్వమంటే ప్రియాంక ఇవ్వలేదు. ఆమె తప్పించుకు తిరుగుతండటంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
Gold Loan Fraud | కేసు నమోదు
కేపీహెచ్బీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంకరెడ్డి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సిబ్బంది సైతం మోసం చేస్తే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి: Harish Rao Counter | ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. సీఎంకు హరీశ్రావు కౌంటర్