అక్షరటుడే, ఇందూరు: Nizamabad MLA | నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Surya Narayana) తెలిపారు. నగరంలోని కార్యాలయంలో ఆదివారం బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేశారు.
Nizamabad MLA | ఎల్వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఆటో నగర్కు చెందిన మూడున్నరేళ్ల బాలిక ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాదపడుతున్నారన్నారు. దీంతో నిమ్స్లో (NIMS) చికిత్స కోసం రూ.5లక్షల ఎల్వోసీ వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. పార్టీలకతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమన్నారు.
Nizamabad MLA | ఎయిమ్స్లో అత్యాధునిక వైద్య సేవలు..
హైదరాబాద్లోని ఎయిమ్స్లో అత్యాధునిక సేవలు అందుబాటు వచ్చాయన్నారు. పేదలు దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్నవారు, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారు ఎయిమ్స్కి వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.వేయి కోట్లతో నిర్మించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. 132 మంది ప్రొఫెసర్లు, 133 మంది సీనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: #Maharashtra ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న #PawanKalyan ను #ApCm నారా #ChandraBabu నాయుడు పరామర్శించారు.