Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం

ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Yedapally Police | ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ (Janakampet)​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Yedapally Police | టిప్పర్​ ఢీకొనడంతో..

జానకంపేట దర్గా వద్ద ఉదయం కమల అనే మహిళ తన కొడుకుతో బైక్​పై నిజామాబాద్ (Nizamabad) వైపు వస్తోంది. అయితే దర్గా సమీపంలోకి రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఆమె బైక్​పై నుంచి ఎగిరిపడింది. టిప్పర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్గా వద్ద ఇరుకైన రోడ్డుపై ట్రాఫిక్​ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

yedapally

ఇది కూడా చదవండి : S Janaki Passing | గానకోకిల ఎస్. జానకి అమరగానం..ఏడు దశాబ్దాల సంగీత ప్రస్థానం ముగింపు

Janakampet Road Accident, Bodhan News, Edapally News, Telangana Accident, Road Safety, Tipper Accident, Nizamabad News, Telangana News

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *