VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు

తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: VIP Security Reduction | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మావోయిస్టుల ముప్పు దాదాపు తొలగిపోవడంతో భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు 100 మందికి పైగా వీఐపీల సెక్యూరిటీని జులై 1 నుంచి తగ్గించనుంది.

దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి దాదాపుగా కనుమరుగు అయింది. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో చాలా మంది ఎన్​కౌంటర్​లలో చనిపోయారు. వందలాది మంది పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ సైతం లొంగిపోయారు. దీంతో దేశంతో పాటు రాష్ట్రంలో మావోయిస్టుల ముప్పు తొలగిపోయింది. ఈ క్రమంలో వీఐపీల భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

VIP Security Reduction | ఖర్చు తగ్గింపు కోసం..

ప్రస్తుతం 600 మంది వీఐపీలకు రక్షణ ఉండగా, గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నేతలు, మాజీ పోలీసు అధికారులకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అత్యున్నత భద్రతా సమీక్ష కమిటీ (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రభుత్వానికి సైతం ఖర్చు తగ్గనుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రముఖుల భద్రతను భారీగా తగ్గించినట్లు సమాచారం.

మావోయిస్టుల ఏరివేత కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్​ను సైతం మూసి వేస్తున్నట్లు ఇటీవల డీజీపీ ఆనంద్​ తెలిపిన విషయం తెలిసిందే. అందులోని సిబ్బందిని ఇతర విభాగాల్లోకి పంపిస్తామన్నారు. గతంలో మావోయిస్టుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని నాయకులకు ఉన్న భద్రతను తాజాగా తగ్గించనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది.

ఇది కూడా చదవండి..: Donald Trump Avenue | భారత్​కు ట్రంప్​ కృతజ్ఞతలు.. ఎందుకో తెలుసా?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *