అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mother Hospital | బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో మాతా–శిశు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
Banswada Mother Hospital | గర్భిణులు అస్వస్థతకు గురి కావడంపై..
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత శుక్రవారం, శనివారం రెండు రోజుల్లో పదిమంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించగా, వారిలో ఐదుగురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారిని మొదట నిజామాబాద్ (Nizamabad)కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించాల్సి వచ్చిందని తెలిపారు. ముగ్గురికి కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన నాయకులు, గత కొంతకాలంగా ఆస్పత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని విమర్శించారు.
Banswada Mother Hospital | అందుబాటులో ఉండని వైద్యులు..

వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండడం లేదని, అవసరమైన మందుల కొరత ఉందని, గర్భిణులు, నవజాత శిశువులకు నిర్వహించాల్సిన పరీక్షలు, టీకాలు కూడా సక్రమంగా జరగడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బాధ్యులపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, బాడి శ్రీనివాస్, ఖలీల్, అక్బర్, ఫిరోజ్, గణేష్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sarpanch Husband Interference | ‘ఆమె’ స్థానంలో దర్జాగా..! హద్దు మీరుతున్న కొందరు ‘సర్పంచ్ భర్తలు’