అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief Visit | నగరంలో(Nizamabad) పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
PCC Chief Visit | రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..
ఆలయంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య జలాభిషేకం(Jalabhishekam) చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నిమ్స్ ఆస్పత్రిలో బాలింతలను పరామర్శించిన హరీష్ రావు