అక్షరటుడే, వెబ్డెస్క్ : Millworks Technologies IPO | మిల్వర్క్స్ టెక్నాలజీస్ అనేది ప్రిసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ. ఇది రైల్వేలు, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగించే యంత్ర భాగాల్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ ద్వారా రూ. 160.34 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్కు చెందినది. ఒక్కో లాట్లో 400 షేర్లున్నాయి. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం రూ. 2,64,800 తో బిడ్లు వేయాల్సి ఉంటుంది.
Millworks Technologies IPO | భారీ స్పందన..
ఈ కంపెనీకి మొదటినుంచి గ్రే మార్కెట్ ప్రీమియం భారీగా ఉండడంతో భారీ స్పందన లభించింది. ఐపీవో (IPO) సబ్స్క్రిప్షన్ ఈనెల 14న ప్రారంభమై 16న ముగియగా.. మొత్తం 219.54 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. రిటైల్ పోర్షనే 216.60 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యిందంటే దీనికి ఎంతటి డిమాండ్ ఉండో అర్థం చేసుకోవచ్చు.
Millworks Technologies IPO | అప్పర్ సర్క్యూట్ ను తాకిన షేరు..
మిల్వర్క్స్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్ఈలో లిస్టయ్యాయి. గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ షేరు ధర రూ. 331 కాగా 90 శాతం ప్రీమియంతో 628.90 వద్ద లిస్టయ్యింది. అనంతరం 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 660.30 వద్ద స్థిరపడింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే దాదాపు రెట్టింపు లాభాలు వచ్చాయన్న మాట.
ఇది కూడా చదవండి..: Vivo T5 Lite | అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్