అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Appointments Approval | రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor Quota MLC)ల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్, కోదండరాం (Kodandaram) ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా గతంలో కోదండరాం, అజారుద్దీన్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైల్ చాలా రోజులుగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండిపోయింది. అనంతరం అజారుద్దీన్ (Azharuddin) మంత్రి అయ్యారు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి కానుంది. ఆలోపు గవర్నర్ ఎమ్మెల్సీల నియమాకానికి ఆమోదం తెలుపకపోతే ఆయన మంత్రి పదవి కోల్పేయేవారు.

MLC Appointments Approval | సీఎం చర్చలతో..
ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలుపకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి పోతుందని.. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) రంగంలోకి దిగారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)తో ఇటీవల భేటీ అయ్యారు. ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలుపాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా గవర్నర్ ఆ ఫైల్పై సంతకం చేశారు. దీంతో అజారుద్దీన్ మంత్రిగా కొనసాగనున్నారు.
ఇది కూడా చదవండి..: Child Marriage | బాల్య వివాహానికి ఆపడానికి వెళ్లి.. పెళ్లి కూతురి చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

