అక్షరటుడే, బాల్కొండ: SRSP Backwaters Tragedy | శ్రీరాంసాగర్ (Sriram Sagar Projec) ప్రాజెక్ట్ పరిధిలో విషాదం నెలకొంది. బ్యాక్ వాటర్లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఐదుగురు యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు.
SRSP Backwaters Tragedy | ప్రమాదకరమైన గుంతల్లో..
నిజామాబాద్కు(Nizamabad) చెందిన ఐదుగురు యువకులతో ఓ బృందం ఆదివారం ఉదయం బ్యాక్వాటర్ పరిసరాల్లో సరదాగా గడిపేందుకు వచ్చింది. యువకులంతా నీళ్లలో స్నానానికి దిగిన అనంతరం నలుగురు యువకులు గుంతల్లో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. మిగితా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ జాన్రెడ్డి, ముప్కాల్ ఎస్సై కిరణ్కుమార్, మెండోరా సుహాసిని సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#BREAKINGNEWS : ఎస్సారెస్పీలో నలుగురి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో విషాదం నెలకొంది. బ్యాక్ వాటర్లో ఆదివారం సరదాగా గడిపేందుకు వచ్చిన ఐదుగురు యువకులు నీళ్లలోకి దిగారు. వారిలో నలుగురు గల్లంతు కాగా ఒకరు బయటపడ్డారు. గల్లంతైన నలుగురిలో ఒకరి… pic.twitter.com/16KjAtL6k5
— Akshara Today | Telugu News (@aksharatoday) July 26, 2026
ఇది కూడా చదవండి : #BREAKINGNEWS : ఎస్సారెస్పీలో నలుగురి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం