అక్షరటుడే, బోధన్: Drinking Water | బోధన్ నియోజకవర్గంలో (Bodhan Constituency) వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చర్యలు చేపట్టామని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato) తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పాండు చెరువును పరిశీలించారు.
Drinking Water | జల వనరుగా పునరుద్ధరించేందుకు..
ఈ సందర్భంగా పాండు చెరువును పరిశీలించిన అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి సందర్భంగా చెరువును ఒక జలవనరుగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఆచన్పల్లి డంపింగ్ యార్డు (Achanpalli Dumping Yard)లో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోజురోజుకూ బోధన్ పట్టణంలో పెరుగుతున్న చెత్త నిర్వహణ కోసం శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట బోధన్ మున్సిపల్ కమిషనర్ (Bodhan Municipal Commissioner), మున్సిపల్ డీఈ (DE), నీటిపారుదల శాఖ ఇంజనీర్లు తదితరులున్నారు.

ఇది కూడా చదవండి..: Chaitanya Reddy Transfer | “ప్రజలతో మమేకం.. సేవలో సంతృప్తి.. విడిపోవడంలో భావోద్వేగం”.. చైతన్య రెడ్డి జర్నీ విత్ కామారెడ్డి!

