అక్షరటుడే, వెబ్డెస్క్: Esha Singh Gold | కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. సోమవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఈషా సింగ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ పతక విజేత మను భాకర్ను ఆమె ఓడించడం గమనార్హం.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈ 21 ఏళ్ల క్రీడాకారిణి తన సంయమనాన్ని కోల్పోకుండా పోడియంపై అగ్రస్థానంలో నిలవగా, మను తీవ్రంగా పోరాడి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్కు షూటింగ్లో రెండు పతకాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ దశలోనే భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పతకాల కోసం పోటీ మొదలయ్యాక, ఈషానే అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్ ఆద్యంతం నిలకడగా ఆడిన ఆమె, 40 హిట్స్ నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Esha Singh Gold | రెండో స్వర్ణం..
కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయి చాను భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. వెయిట్ లిఫ్టింగ్లో ఆమె సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించారు. తాజాగా ఈషా సింగ్ రెండో బంగారు పతకాన్ని భారత్ ఖాతాలో వేశారు. షూటింగ్లో ఒకే విభాగంలో భారత్ రెండు పతకాలు గెలుచుకోవడం గమనార్హం. ఈషా సింగ్, మను భాకర్ను పలువురు అభినందించారు.
ఇది కూడా చదవండి..: Anti Paper Leak Bill | లోక్సభ ముందుకు.. యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు