అక్షరటుడే, బాన్సువాడ: Palle Dawakhana Services | పల్లె దవాఖానాలో నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. పట్టణంలోని పాత బాన్సువాడ పల్లె దవాఖానాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Palle Dawakhana Services | రోగులతో మాట్లాడి.. సమస్యలు తెలుసుకుని..
ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన చికిత్స అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Adilabad Armur Railway Line | ఆదిలాబాద్, ఆర్మూర్ రైల్వే లైన్కు డీపీఆర్ పూర్తి