అక్షరటుడే, ఆర్మూర్: SRSP Ministers Visit | ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణ (Telanagana) వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project) జలకళను సంతరించుకుంది. ఎల్నినో ప్రభావంతో వానలు ఆలస్యం కావడంతో ప్రాజెక్ట్ ఇన్నాళ్లు వెలవెలబోయింది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
SRSP Ministers Visit | మంత్రుల రాక..
ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ఎస్సారెస్పీని సందర్శించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయం నుండి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు(SRSP) అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.
SRSP Ministers Visit | పర్యటన షెడ్యూల్ ఇలా..
ఇద్దరు మంత్రులు ఉదయం హెలిక్యాప్టర్ ద్వారా ఉదయం 11గంటలకు మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. ఉదయం 11.45 నుంచి 12.30వరకు ప్రాజెక్ట్ను సందర్శిస్తాఉ. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో నిర్మల్ జిల్లాకు బయలుదేరుతారు. అనంతరం కడెం ప్రాజెక్ట్ను సైతం సదర్శించనున్నారు. మధ్యాహ్నం 1:35 నుండి 2:20 వరకు కడెం ప్రాజెక్టును సందర్శిస్తారు. తిరిగి 3.10కు హెలికాప్టర్లో పెద్దపల్లి జిల్లా గోలివాడ సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటారు. సాయంత్రం 3.50 నుండి 4.50వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి తనిఖీ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోనున్నారు.
ఇది కూడా చదవండి: షూటింగ్లో నటి రష్మికకు గాయాలు