అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Inflow | ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project)లో వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం సైతం పెరుగుతోంది.
Nizamsagar Inflow | 8,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405(17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1398.37 అడుగుల(9.690 టీఎంసీలు)కు చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 4.627 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేకపోవడంతో కేవలం ఆవిరిరూపంలో 166 క్యూసెక్కులు పోతోంది.
Nizamsagar Inflow | కళ్యాణి, సింగితం రిజర్వాయర్లలో..
కళ్యాణి ప్రాజెక్ట్కు 100 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, అంతే మొత్తాన్ని ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 408 మీటర్లుగా (పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల) ఉంది. సింగితం రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి (416.550 మీటర్లు) చేరడంతో ప్రస్తుతం వస్తున్న 663 క్యూసెక్కుల ఇన్ఫ్లోను నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లించారు.
ఇది కూడా చదవండి..: SRSP Flood Inflow | ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద.. 36 టీఎంసీలకు చేరిన నీటినిల్వ