అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain Alert | సెల్ఫీలు, వీడియోల కోసం వాగులు, కల్వర్టులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకోవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rain Telangana) నేపథ్యంలో మంగళవారం ఆయన పట్టణంలోని(Kamareddy) పెద్ద చెరువు, జీఆర్ కాలనీ బ్రిడ్జి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
Kamareddy Rain Alert | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, చెరువులు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఫీల్డ్లోనే ఉండి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
భారీవర్షాలు కొనసాగుతున్నందున ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా డయల్-100ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ మధుసూధన్, టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, ఎస్ఐలు రంజిత్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు