Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు తగ్గిన వరద

శ్రీశైలం ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Project Flood | శ్రీశైలం ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం నీటిమట్టం నిలకడగా ఉంది.

ఎగువన ప్రాజెక్టుల గేట్లు మూసివేయడంతో శ్రీశైలంకు ఇన్​ఫ్లో తగ్గింది. ప్రస్తుతం జలాశయానికి 51,016 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా 44,928 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు నాగర్జున సాగర్​కు వెళ్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిరంతర విద్యుత్ ఉత్పత్తి కారణంగా శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) జలాశయం నిల్వ గణనీయంగా పెరగడం లేదు.

Srisailam Project Flood | ఆల్మట్టికి పెరిగిన ఇన్​ఫ్లో

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం ఇన్​ఫ్లో పెరిగింది. 80 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో దిగువకు నీటి విడుదలను 42 వేల క్యూసెక్కుల నుంచి 75 వేల క్యూసెక్కులకు పెంచారు. జలాశయం సామర్థ్యం 123 టీఎంసీలు కాగా 121 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్​ నుంచి దిగువకు నీటి విడుదల పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరద పెరిగే అవకాశం ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Weather | నేడు రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *