108 Nizamabad | ముళ్లపొదల్లో నవజాత శిశువు..అక్కున చేర్చుకున్న 108 సిబ్బంది

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లగా స్పందించి 108 సిబ్బంది అక్కున చేర్చుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: 108 Nizamabad | నిజామాబాద్​ జిల్లాలో వరుసగా నవజాత శిశువులను వదిలించుకుంటున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

వారంరోజుల క్రితం జీజీహెచ్​ డ్రెనేజీలో నవజాత శిశువు మృతదేహం లభించగా.. తాజాగా బుధవారం ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలివెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, స్పందించిన 108 సిబ్బంది శిశువును అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటన మోపాల్ (Mopal)​ మండలంలో బుధవారం చోటుచేసుకుంది.

108 Nizamabad | మోపాల్​–సిర్​పూర్​ మధ్యలో..

మోపాల్​–సిర్​పూర్​ గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో నవజాత శిశువు ఏడుపు వినిపించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆడ శిశువును అక్కున చేర్చుకుని జిల్లా ఆస్పత్రికి (GGH Nizamabad) తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రెండురోజుల క్రితం జన్మించినట్లుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని జిల్లా ఇన్​ఛార్జి జనార్ధన్​ అభినందించారు.

ఇది కూడా చదవండి: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *