అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Fee Reimbursement | రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ (Additional Collector)కు వినతిపత్రం అందజేశారు.
Fee Reimbursement | ప్రజావాణిలో..
బీఆర్ఎస్వీ నాయకులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. అనంతరం బీఆర్ఎస్వీ నగర కార్యదర్శి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గాడనిద్ర నుంచి బయటకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం దగ్గర నిధులున్నాయి కానీ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఎన్నికల్లో భాగంగా గ్రీన్ఛానల్ తీసుకొచ్చి ఒకేసారి ఫీజు బకాయిలను విడుదల చేస్తామని హామీలిచ్చి విద్యార్థి లోకాన్ని నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మోసం చేస్తోందన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Pan Shop Cases | పాన్షాప్లపై కేసుల నమోదు..

