అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Senior Citizens Forum | నగరంలో కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం పులిహోర వితరణకు శ్రీకారం చుట్టారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
Senior Citizens Forum | వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో..
వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో.. ప్రజావాణికి ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టామని ఫోరం సభ్యులు తెలిపారు. ప్రతి సోమవారం దీనిని కొనసాగిస్తామని ప్రతినిధులు తెలిపారు. కాగా.. రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని సమకూర్చారు. ఫోరం ప్రతినిధులను, వాకర్స్ గ్రూప్ బాధ్యులను అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, సీనియర్ సిటిజన్స్ ఫోరం, వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Collectorate Parking Fire | కలెక్టరేట్ పార్కింగ్లో మంటలు..

