అక్షరటుడే, కామారెడ్డి: Police misconduct complaint | న్యాయం చేయాలని వెళ్లిన తనపై బెదిరింపు ధోరణితో మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాజంపేట (Rajampet) మండలం ఆర్గొండ సర్పంచ్ విక్రాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మానవహక్కుల సంఘంతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
Police misconduct complaint | కామారెడ్డి పట్టణంలో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతనెల 18న కామారెడ్డి పట్టణంలో (Kamareddy Police) ఆర్గొండ గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్ల కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. ఈ కేసులో బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి కామారెడ్డి పోలీసులు నిరాకరిస్తున్నారని తెలుసుకుని తాను బాధితుడి తరపున సర్పంచ్ హోదాలో కామారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లానన్నారు. అయితే బాధిత తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా తనపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల వేస్తానని పోలీసులు బెదిరించారని.. అక్కడే ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై గత నెల 21న జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని (SP Rajesh Chandra) కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి తనకు న్యాయం చేయాలని ఐజీ, హ్యూమన్ రైట్స్ కమిషన్కు కోరానన్నారు.
ఇది కూడా చదవండి: Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్ఎస్ పోరుబాట

