ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

నిర్మల్​ సర్కిల్​ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటూ దొరికారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ శాఖలో చూసినా లంచాలు తీసుకునే అధికారులకు కొదవ లేకుండా పోయింది. ఏసీబీ దాడులు చేస్తున్నా.. అవినీతి అధికారులు మారడం లేదు.

నిర్మల్ (Nirmal)​ సర్కిల్​ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) వల పన్ని పట్టుకుంది. మంచిర్యాల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త లక్కింశెట్టి వీర భాస్కర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Raid | ఆడిట్​ నివేదిక కోసం..

భాస్కరరావుకు చెందిన లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ 2022-23, 2023-24 రికార్డుల ఆడిట్ విషయంలో అధికారికంగా సహాయం చేసినందుకు ట్యాక్స్​ ఆఫీసర్ (Tax Officer)​ గోదావరి రూ.లక్ష లంచం డిమాండ్​ చేశారు. ఫిర్యాదిదారుడు పదేపదే చేసిన అభ్యర్థనల మేరకు, ఆ మొత్తాన్ని రూ.90 వేలు, రూ.80 వేలుకు తగ్గించారు. మరియు చివరకు రూ.50 వేలు తీసుకోవడానికి అంగీకరించారు. వ్యాపార రికార్డులకు సంబంధించి అనుకూలమైన ఆడిట్ నివేదికను జారీ చేయడం ద్వారా తక్కువ పన్ను విధించదగిన టర్నోవర్/జీఎస్టీ బాధ్యతను చూపించడానికి ఈ మొత్తం అడిగారు. ఈ మేరకు సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి ట్యాక్స్​ ఆఫీసర్​ గోదావరి రూ.50 వేలు తీసుకున్నారు. అనంతరం ఆ డబ్బును సీనియర్​ అసిస్టెంట్​ మంత్రి సాయి కృష్ణకు అందజేశారు. నిందితులు ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, జీపీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *