అక్షరటుడే, వెబ్డెస్క్ : RI Caught by ACB | యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా ఆలేరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు, కొలనుపాక జీపీవో (GPO) షేక్ అహ్మద్ ఏసీబీ (ACB)కి చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కొలనుపాక రెవెన్యూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోదరి అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ఆర్ఐ పూర్ణచందర్రావు రూ.14 వేల లంచం డిమాండ్ చేశాడు. జీపీవో అహ్మద్ ద్వారా ఆయన లంచం అడిగాడు. పైసలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పాడు. దీంతో మహిళ సోదరుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి సోమవారం ఆర్ఐ, జీపీవో రూ.14 వేల లంచం తీసుకుంటుండగా నల్గొండ యూనిట్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
RI Caught by ACB | జోరుగా అవినీతి
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో జోరుగా అవినీతి సాగుతోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా తహశీల్దార్లు కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అయితే లంచం తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
దీనిని కూడా చదవండి : Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్