అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కన్నతల్లికి కడసారి వీడ్కోలు పలకడానికి కొడుకు ఉండాలనే పాత ఆచారాన్ని ఒక కూతురు తన ప్రేమతో చెరిపేసింది. తల్లికి తానే కొడుకుగా మారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
Kamareddy | అడ్లూర్లో..
మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ 2వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన పెరుమాండ్ల రాజమణి (65) అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె భూమవ్వ మాత్రమే. తల్లి మృతితో కుంగిపోయినా, ధైర్యం తెచ్చుకుంది భూమవ్వ. బంధువులు, కాలనీ వాసుల సమక్షంలో తల్లి అంతిమ సంస్కాలు నిర్వహించింది. ఈ సమయంలో కూతురి రోదనలు అందరినీ కలచివేశాయి. మారుతున్న కాలంలో ఆడపిల్లలు కూడా అన్ని బాధ్యతలు మోయగలరని, ఇలాంటి ఘటనలు సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Vijay Sai Reddy | మత మార్పిడులను ప్రోత్సహించిన జగన్ : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి