అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana Liberation Day | సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు.
Telangana Liberation Day | త్యాగాలు చేసిన రోజు..
దినేష్ కులాచారి మాట్లాడుతూ.. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. దీంట్లో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరగాలన్నారు. హైదరాబాద్ విమోచనంలో కీలకపాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు(Sardar Vallabhbhai Patel) హైదరాబాద్లో (Hyderabad) భారీ స్టాచ్యూ ఏర్పాటు చేయాలన్నారు.
నిజాం పాలన, రజాకార్ల దురాగతాలు, ప్రజాపోరాటాలు, ఆపరేషన్ పోలో, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను పరిరక్షించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్మృతికేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్