అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy RTC Driver | ఉద్యోగం కోల్పోయిన మనస్తాపంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
Kamareddy RTC Driver | వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి (Kamareddy) డిపోలో రెగ్యులర్ డ్రైవర్ గా పనిచేస్తున్న పర్షం సాయన్న (48) నాలుగు నెలల క్రితం డిపోలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. పరీక్షలో 33 శాతం నమోదు కావడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసి, అనంతరం సర్వీసు నుంచి తొలగించారు. అప్పటినుంచి తిరిగి ఉద్యోగం పొందేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. న్యాయపరమైన చిక్కులతో తిరిగి ఉద్యోగం రావడానికి 4-5 ఏళ్లు పడుతుందని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి ఇటీవలే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది. సాయన్న మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: RI Death Incident | గన్ మిస్ఫైర్.. ఆర్ఐ మృతి