Maize Crop Fire | మొక్కజొన్న పంట దగ్ధం.. పరిశీలించిన ఎమ్మెల్యే

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Crop Fire | మద్నూర్ మండలం (Madnur Mandal) శేఖాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి మొక్కజొన్న పంట దగ్ధమైంది. ప్రమాదవశాత్తు మొక్కజొన్న రాశిని మంటలు అంటుకోవడంతో పంట పూర్తిగా కాలిపోయింది.

Maize Crop Fire | పరామర్శించిన ఎమ్మెల్యే..

ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmikantharao) గురువారం ఉదయం గ్రామానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే, అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. పంటనష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

రైతులు (Farmers) ఎదుర్కొన్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Rural Health Development | గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *