అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు భరోసా సెంటర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంటర్ కోఆర్డినేటర్ రోజా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీపై (Child Safety) భరోసా సెంటర్ ఆధ్వర్యంలో బోధన్ డివిజన్లోని పలు గ్రామాల్లో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
Bharosa Center | సీపీ ఆదేశాల మేరకు..
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు భరోసా సెంటర్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police Commissionerate) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ తెలిపారు. మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం తదితర అంశాలపై ఆయా గ్రామాల్లో ప్రజలకు వివరించారు. అలాగే భరోసా సెంటర్ అందిస్తున్న సేవలను తెలియజేశారు. అదనంగా మహిళా సాధికారత, బాలల హక్కుల పరిరక్షణ వివరాలను చెప్పారు. టీ సేఫ్ యాప్(T-Safe App), సైబర్ క్రైమ్ (cyber crime safety), స్టాండ్ విత్ హర్ (Stand With Her) కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో టీ–సేఫ్ యాప్ (T-Safe App) వినియోగం, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై జాగ్రత్తలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై వివరించారు.
ఇది కూడా చదవండి: KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు : కేటీఆర్

