అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments | రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో ఖాళీగా ఉన్న ముఖ్యమైన పోస్టులకు ప్రభుత్వం అధికారులను నియమించింది.
Nizamabad DRO Appointments | నియమితులైన అధికారులు వీరే..
డిప్యుటేషన్పై హైదరాబాద్ (Hyderabad)లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లను ఉమ్మడి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘కుడా’లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి అడ్లాను బాన్సువాడ ఆర్డీవోగా నియమించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ బి.గీతను నిజామాబాద్ డీఆర్వోగా బదిలీ చేశారు. అలాగే మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎం.విజయ కుమారిని బోధన్ ఆర్డీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లు తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

