అక్షరటుడే, ఎల్లారెడ్డి : Census Self Enumeration | జనాభా లెక్కల స్వీయగణన 2027లో భాగంగా నాగిరెడ్డిపేట మండలం (Nagireddypeta Mandal)లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ప్రారంభించారు.
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వచ్ఛందంగా స్వీయగణన చేసుకోవాలన్నారు. అచ్చాయిపల్లి గ్రామాన్ని (Achchaipalli village) పైలట్ గ్రామంగా ప్రచార రథంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధానంపై అధికారులు అవగాహన కల్పించారు.
Census Self Enumeration | స్వీయ గణన ప్రాముఖ్యత..
ప్రతి పౌరుడు మొబైల్ యాప్ లేదా వెబ్పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అధికారులు వివరిచారు. దీనివల్ల కచ్చితమైన జనాభా లెక్కలు (Census) సాధ్యమవుతాయని ఎంపీఎస్వో స్వాతి వివరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సందీప్, గిర్దావర్ మహేష్ చంద్ర, జీపీవో రవి, ఇతర గ్రామాల జీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా స్వీయ గణనపై అవగాహన కల్పిస్తామని తహశీల్దార్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: BRS Councillor Resignation | బీఆర్ఎస్కు కౌన్సిలర్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరిక

