Census Self Enumeration | నాగిరెడ్డిపేట మండలంలో జనాభా లెక్కల స్వీయ గణనకు శ్రీకారం

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Census Self Enumeration | జనాభా లెక్కల స్వీయగణన 2027లో భాగంగా నాగిరెడ్డిపేట మండలం (Nagireddypeta Mandal)లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వచ్ఛందంగా స్వీయగణన చేసుకోవాలన్నారు. అచ్చాయిపల్లి గ్రామాన్ని (Achchaipalli village) పైలట్ గ్రామంగా ప్రచార రథంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధానంపై అధికారులు అవగాహన కల్పించారు.

Census Self Enumeration | స్వీయ గణన ప్రాముఖ్యత..

ప్రతి పౌరుడు మొబైల్ యాప్ లేదా వెబ్‌పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని అధికారులు వివరిచారు. దీనివల్ల కచ్చితమైన జనాభా లెక్కలు (Census) సాధ్యమవుతాయని ఎంపీఎస్​వో స్వాతి వివరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సందీప్, గిర్దావర్ మహేష్ చంద్ర, జీపీవో రవి, ఇతర గ్రామాల జీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా స్వీయ గణనపై అవగాహన కల్పిస్తామని తహశీల్దార్ తెలిపారు.

ఇది కూడా చదవండి..: BRS Councillor Resignation | బీఆర్​ఎస్​కు​ కౌన్సిలర్ రాజీనామా.. కాంగ్రెస్​లో చేరిక

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *